Pawan Kalyan: నాయకుడు, కవి.. కార్మికుల వైపు నిలబడాలి: పవన్ కల్యాణ్
‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో
విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సభలో పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి కూర్మన్నపాలెంగేటు సభా స్థలి వరకు పవన్ కల్యాణ్ వెంట జనసైనికులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ ఉపన్యాసం ప్రారంభంలో శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. ‘‘నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలి. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యం. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉంది. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చింది. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపింది’’ అని పవన్ వివరించారు.
రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలి...
‘‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. హోం మంత్రి అమిత్షాను కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని కోరాం. నా వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. మాకున్న ఒక్క ఎమ్మెల్యేను వైకాపా లాక్కెళ్లింది. ప్రజాబలం ఉందనే నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు. అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి. ఏ పరిశ్రమకు నష్టాలు రావు? ఏ కంపెనీకి అప్పులు లేవు? అలా నష్టాలు లేని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది వైకాపా రాజకీయ పరిశ్రమ మాత్రమే. కార్మికుల కష్టాలు కేంద్రానికి ఏం తెలుస్తాయి. ఇక్కడి సమస్యలు తెలియవు. మన ఎంపీలు కేంద్రానికి చెప్పాలి. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన వాళ్లు గుళ్లో ప్రసాదం తిని బతికారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని ఎందుకు అడగలేదు? గతంలో విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను కూడా పోరాడి కాపాడుకోగలిగాం. మన పోరాటానికి స్పందించిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం కాకుండా అపగలిగింది. మన ఎంపీలు రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు. రాష్ట్ర విభజన వేళలోనూ మన ఎంపీలు మాట్లాడలేదని దిల్లీ పెద్దలు ఇప్పటికీ అంటారు. పార్లమెంట్కు వెళ్లేది కబుర్లు చెప్పుకునేందుకు.. కాఫీలు తాగేందుకా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ముందు రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలి. విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు.. 32 మంది ఆత్మ బలిదానంతో పోరాడి సాధించుకున్నాం.
దిల్లీలో మద్దతిచ్చి.. ఏపీలో బంద్ చేస్తారా?
పెట్టుబడుల ఉపసంహరణ అనేది కొత్తగా వచ్చింది కాదు. 1992 నుంచే పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. కార్మిక సంఘాల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయి. సమస్యలు వస్తే నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కాదు. నాకు ముందడుగు వేయడమే తెలుసు.. వెనకడుగు తెలియదు. కేంద్రంలోని పెద్దలు మా మాట వినరని వైకాపా నేతలు చెబుతున్నారు. కానీ, సీఏఏకు ఎందుకు మద్దతిచ్చారు. వ్యవసాయ చట్టాలకు దిల్లీలో మద్దతిచ్చి.. ఏపీలో బంద్కు మద్దతిచ్చారు. కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు వైకాపా ఎంపీలు మద్దతిచ్చారు. ద్వంద్వరాజకీయాలు ఎందుకు చేస్తున్నారు. వైకాపా నేతలు కేంద్రానికి ఎందుకు మద్దతిస్తున్నారు? బిల్లులకు మద్దతిచ్చినప్పుడు.. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని 22 మంది ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగలేదు? వైకాపా నేతలు.. పోరాటాలు చేసి వచ్చినవారు కాదు. వారికి తెలిసింది.. కాంట్రాక్టులు, పదవులు, సారా డబ్బులే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ.. ఆంధ్రుల ఆత్మగౌరవ విషయం. నాకు ఒక్క ఎంపీ ఉన్నా ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు తెచ్చేవాడిని. చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నేతలతో మాట్లాడండి. ప్రజల్లో కోపం లేకపోతే సమాజంలో మార్పు రాదు. స్టీల్ప్లాంట్ రక్షణ కోసం వారంలోగా అఖిలపక్షం పిలవాలి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైకాపా నేతలు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి? వైకాపా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం. మన పోరాటం మనం చేయకుండా.. కేంద్రాన్ని అనడం నాకిష్టం లేదు’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్