Punjab elections 2022: కాంగ్రెస్ టికెట్ నిరాకరణ.. స్వతంత్రంగా పోటీకి దిగిన సీఎం సోదరుడు
కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో.. స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు పంజాబ్ ముఖ్యమంత్రి సోదరుడు......
చండీగఢ్: ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ రంగప్రవేశం చేయాలని భావించిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ సోదరుడు మనోహర్సింగ్కు భంగపాటు. ఆశించిన విధంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. దీంతో మనోహర్ స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బస్సి పతానా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన మనోహర్సింగ్.. తన ఉద్యోగాన్ని వదులుకొని రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. బస్సి పతానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించారు. అయితే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. బస్సి పతానా సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్ప్రీత్సింగ్ జీపీకే టికెట్ ఖరారుచేసింది. ‘ఒక కుటుంబం, ఒకే టికెట్’ నిబంధనలో భాగంగా మనోహర్కు టికెట్ దక్కనట్లు తెలుస్తోంది. కాగా సోదరుడు, సీఎం చరణ్జిత్ ఈసారి కూడా చామ్కౌర్ సాహెబ్ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మనోహర్సింగ్ స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 86మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం మధ్యాహ్నం ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, ఇటీవల కాంగ్రెస్లో చేరిన ప్రముఖ సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్కు మోగ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఉపముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా డేరాబాబా నానక్ స్థానం నుంచి, రవాణాశాఖ మంత్రి రాజా అమరిందర్ గిద్దర్బహా నుంచి బరిలో దిగుతున్నారు. 117 స్థానాలు కలిగిన పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
దక్షిణాదిలో భాజపా ఈసారి అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు. -
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు