Punjab Polls: సీఎం చన్నీకి భగవంత్ మాన్ సవాల్!
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ......
చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలు విపక్షాలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సీఎం చన్నీకి సవాల్ విసిరారు. తాను బరిలో ఉన్న ధూరి స్థానంలో చన్నీ పోటీ చేయగలరా? అన్నారు. చన్నీ పోటీ చేస్తున్న చామ్కౌర్ షాహిబ్ సీటు రిజర్వుడ్ స్థానం గనక తాను అక్కడి నుంచి పోటీ చేయలేననీ.. కానీ చన్నీ ధూరి సీటులో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆయన తనపై పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని భగవంత్ మాన్ చెప్పారు. మరోవైపు, శనివారం భగవంత్ మాన్ చన్నీ అమృత్సర్లోని స్వర్ణదేవాలయం, శ్రీరామతీర్థ మందిర్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం చన్నీ తన పేరిట ఉన్నట్టుగా రూ.56కోట్ల విలువైన అక్రమాస్తులకు సంబంధించిన పేపర్లపై ఆయన తప్పనిసరిగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో చన్నీ జోక్యం ఉన్నట్టు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ కూడా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా భగవంత్ మాన్ ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్