TS News: రైతులను ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Published : 22 Jan 2022 01:25 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మిర్చి పంట బాగా పండితే ఎకరాకు రూ.3.50లక్షల ఆదాయం వస్తోందని ఆశపడిన రైతులు ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టారన్నారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులు, అధికారులను పంపించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని