AP NEWS : వనరుల్ని దోచేస్తూ ఖజానా ఖాళీ అయిందంటే ఎలా?: సోము వీర్రాజు
వనరుల సక్రమ వినియోగంతో ఉద్యోగుల పీఆర్సీ సహా ప్రజా సమస్యలూ తీర్చవచ్చని..
విజయవాడ: వనరుల సక్రమ వినియోగంతో ఉద్యోగుల పీఆర్సీ సహా ప్రజా సమస్యలూ తీర్చవచ్చని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఒక్కో జిల్లాను ఒక్కో బంధువుకు అప్పగించేశారని విమర్శించారు. బంధువుల ద్వారా ఇసుక, మట్టి, గనులు సహా అన్నింటినీ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి వనరుల్ని దోచేస్తూ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మట్టిని తవ్వేసుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీర్రాజు స్పందించారు. ‘‘ప్రభుత్వం మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామంటోంది. ఈ మేరకు జిల్లాల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలి. కమిటీ వేసి ప్రజల కోరికను ప్రభుత్వం తెలుసుకోవాలి’’ అని తెలిపారు. బస్టాండ్కు దిక్కులేదంటే.. వైకాపా నేతలు జిల్లాకో విమానాశ్రయం అంటున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రోడ్లనే సరిగ్గా వేయలేని ప్రభుత్వం.. జిల్లాకో ఎయిర్పోర్టులను పెట్టేస్తారని చెబితే ఎవరైనా నమ్ముతారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్