Politcs: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల విజయం భాజపాదేనా?
వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 4 చోట్ల భాజపా విజయం సాధించనుందని ఏబీపీ- సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్ సర్వే అంచనావేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్లో...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 4 చోట్ల భాజపా విజయం సాధించనుందని ఏబీపీ- సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్ సర్వే అంచనావేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్లో గతం కంటే తక్కువ స్థానాలు గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. పంజాబ్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది. పంజాబ్ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనట్లు సర్వే వెల్లడించింది.
ఉత్తర్ప్రదేశ్లో 217 స్థానాలు:
ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీ మరోసారి జయకేతనం ఎగరేస్తుందని ఏబీపీ సర్వే వెల్లడించింది. 403 శాసనసభ స్థానాలున్న యూపీలో కమళదళం మిత్రులతో కలిసి 217 సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. 2017లో 325 సీట్లు సాధించిన భాజపా.. ఈసారి 108 స్థానాలు కోల్పోనుందని పేర్కొంది. ఈ స్థానాలను సమాజ్వాదీ పార్టీ దక్కించుకోనుందని సర్వే వెల్లడించింది. యూపీలో భాజపా-ఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, సమాజ్వాదీ పార్టీ 156 సీట్లు దక్కించుకునే అవకాశముందని సర్వే తెలిపింది. అయితే భాజపా ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండబోదని, 40.7శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికల కంటే 0.7శాతం తక్కువ. ఎస్పీ 7.1శాతం అధికంగా, 31.1 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది.
ఉత్తరాఖండ్లో పుంజుకోనున్న కాంగ్రెస్
యూపీతోపాటు ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లోనూ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలో తేలింది. పంజాబ్లో ఆమ్ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే అంచనా వేసింది. 70 శాసనసభ స్థానాలున్న ఉత్తరాఖండ్లో 38 సీట్లతో భాజపా మెజార్టీ మార్కును దాటుతుందని సర్వే పేర్కొంది. గతంలో ఆ పార్టీ సాధించిన 57 సీట్లతో పోలిస్తే 19 స్థానాలు తక్కువని అంచనా వేసింది. హస్తం పార్టీ 21 సీట్లు ఎక్కువ సాధించి, తన బలాన్ని 32కి పెంచుకుంటుందని సర్వే పేర్కొంది. 117 స్థానాలున్న పంజాబ్ శాసనసభలో 51 సీట్లతో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. అధికార కాంగ్రెస్ 46 సీట్లకు పరిమితం కానున్నట్లు అంచనా వేసింది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన హస్తం పార్టీ.. ఈసారి 31 నియోజకవర్గాలు కోల్పోనుందని తెలిపింది. అయితే కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ పాలన కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశముంది. 20 సీట్లతో అకాళీదళ్ మూడో స్థానంలో నిలవనుందని సర్వే పేర్కొంది.
గోవాలో 21 సీట్లు!
40 శాసనసభ స్థానాలున్న గోవాలో అధికార భాజపా 21 స్థానాలతో తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఆప్ 5, కాంగ్రెస్ 4 స్థానాలు సాధిస్తాయని లెక్కకట్టింది. ఇతరులు 10 చోట్లు గెలుపొందుతారని పేర్కొంది. మణిపూర్లోనూ కమలం పార్టీదే ఆధిక్యమని సర్వే తేల్చింది. 60 శాసనసభ స్థానాల్లో భాజపా 27, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
మోదీ పని తీరు సంతృప్తికరం
ప్రధాని మోదీ పనితీరుపై ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. 41.4 శాతం మంది చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. 26.9శాతం మంది కొంత వరకు సంతృప్తికరమని, 29.1 శాతం మంది అసలు సంతృప్తిగా లేమన్నారని సర్వే తేల్చింది. 2.6శాతం మంది ఏమీ చెప్పలేమని బదులిచ్చారు. కేంద్రం పని తీరుపై 36.3శాతం మంది ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేయగా.. 28.4శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. 31.8శాతం మంది అసలు సంతృప్తికరంగా లేమన్నారు. 3.5 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పని తీరుపై పంజాబ్లో ఎక్కువగా వ్యతిరేకత కనిపించినట్లు సర్వే తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. -
భీమిలి నియోజకవర్గంలో తెదేపాలోకి క్యూ కడుతున్న వైకాపా నేతలు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు. -
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు. -
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా
పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న పవన్కల్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. -
సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు
విశాఖలో ఆదివారం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. -
ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?
‘విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. -
శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
సొమ్ముతో ప్రచార సోకులు!
సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. -
బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. -
ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు ఆరోపించారు. -
ఆర్జేడీలో చేరిన బిహార్లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ
బిహార్కు చెందిన ఎల్జేపీ లోక్సభ సభ్యుడు మహబూబ్ అలీ కైసర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్ అలీ కావడం గమనార్హం. -
హెచ్సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం