దీదీ.. ఆ లెటర్‌ ప్యాడ్‌లు ప్రింట్‌ చేయించుకోండి! 

నందిగ్రామ్‌ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచి దీదీకి సవాల్‌ విసురుతున్న సువేందు అధికారికి అసదాల నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ని టీఎంసీ జెండాలు.....

Published : 30 Mar 2021 01:03 IST

మమతకు సువేందు అధికారి సలహా

అసదాల: నందిగ్రామ్‌ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచి దీదీకి గట్టి సవాల్‌ విసురుతున్న సువేందు అధికారికి అసదాల నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ని టీఎంసీ జెండాలు పట్టుకొన్న కొందరు కార్యకర్తలు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై సువేందు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రత్యేకించి ఒక వర్గానికి చెందిన వారి పనేనన్నారు. ఇక్కడి పోలీసులు ఇంకా మమతా బెనర్జీ రాజకీయంగా సజీవంగానే ఉన్నారని, ఎన్నికల సంఘం దిల్లీలో మౌనంగా కూర్చొంటుందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ మురికి భాషను వాడుతున్నారని, ఆమె మాటలకు తాను స్పందించబోనన్నారు.

దీదీ ఓటమితో పారిపోవడం ఖాయం

మమత వ్యాఖ్యల ప్రభావం ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపబోదని సువేందు తెలిపారు. ఆమెకు ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలై పారిపోవడంలో దీదీ చరిత్ర సృష్టిస్తారంటూ ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యేగా లెటర్‌ ప్యాడ్‌లు ప్రింట్‌ చేయించుకోవాలంటూ మమతకు సలహా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని