దీదీ నామినేషన్‌పై సువేందు అభ్యంతరం 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి,........

Published : 15 Mar 2021 17:56 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, ఈ నెల 10న నందిగ్రామ్‌ నుంచి దీదీ దాఖలు చేసిన నామినేషన్‌పై ప్రత్యర్థి సువేందు అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్‌ కేసులు ఉన్నప్పటికీ ఆమె వాటిని అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్‌లో ఒక సీబీఐ కేసుతో పాటు అసోంలో ఆమెపై ఐదు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీదీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈసీని కోరినట్టు చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. వారేం ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని, చట్టపరంగా చర్యలు ఉండాలన్నారు. నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, తన బాధ్యతగా ఈసీకి అన్ని ఆధారాలూ సమర్పించానన్నారు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని