జగన్ ముందుంటే.. మేమంతా ఆయన వెంటే: అయ్యన్న
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ..
విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. సీఎం ముందుంటే తామంతా ఆయన నాయకత్వంలో పోరాడేందుకు తామంతా సిద్ధమని సవాల్ విసిరారు. దిల్లీ వెళ్లి ప్రధాని వద్ద పోరాడదామని అయ్యన్న పిలుపునిచ్చారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైకాపా ఎంపీలతో వెళ్లి కేంద్రం మెడలు ఎందుకు వంచడం లేదని సీఎం జగన్ను అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వైకాపా వాటాలు కొనాలని చూస్తోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఉక్కు కర్మాగారం లాంటి పెద్ద సమస్య వచ్చినపుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీఎంను ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు ఉందని ఆక్షేపించారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం చేద్దామన్నారు.
ఉక్కు కర్మాగారంపై ప్రత్యక్షంగా 40వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలంతా ఒకేమాటపై ఉండాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి..
అలాంటి అధికారులకు బ్లాక్లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి | ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం