Kodali Nani: భాజపాతో పొత్తా.. పవన్కు సిగ్గులేదా?: కొడాలి నాని
బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాకు 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని.. భాజపాకు ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు.
అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాకు 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని.. భాజపాకు ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘భాజపాపై పెట్రోల్.. తెదేపాపై డీజిల్ పోసి జనం తగులబెట్టారు. జనసేన పలికిమాలిన పార్టీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ కల్యాణ్కు సిగ్గు లేదా? పశ్చిమ్బెంగాల్లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లోనూ భాజపాను ఓడించారు. అధికారం ఉన్న చోట.. లేని చోటా ఆ పార్టీ చిత్తుగా ఓడింది. జగన్ మేక, నక్క కాదు.. పులివెందుల పులి. గల్లీలో ఉన్న సిల్లీ భాజపా నాయకులు ఆయన్ను ఏమీ చేయలేరు. పార్టీలో ఉండి సర్వనాశనం అవుతున్నామని కేంద్రానికి చెప్పండి.
ఆ మూడు పార్టీలూ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి..
ప్రజా సమస్యల పేరుతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలట. అఖిలపక్ష భేటీ పేరుతో వీళ్లకి అపాయింట్మెంట్ ఇప్పించాలట. వారంలో అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని జగన్కు వార్నింగ్ ఇస్తున్నారు. మోదీ, అమిత్షా అపాయింట్మెంట్ కోసం జగన్ రావాలి. అఖిలపక్షంలో చంద్రబాబు, పవన్ దూరి దిల్లీ వస్తామంటారు. వ్యక్తిగతంగా మాట్లాడాలని కాళ్లు పట్టుకుంటారు. పొత్తులు, రాజకీయాల గురించి మాట్లాడాలని యత్నిస్తున్నారు. ఆ మూడు పార్టీలూ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మీ రాజకీయ అవసరాల కోసం కేంద్రం వద్దకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు.
పెట్రోల్ ధరలు మేమెందుకు తగ్గించాలి?
పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రానికి సంబంధించిన అంశం. పెట్రో ధరలు తగ్గిస్తే కేంద్రమే తగ్గించాలి. మేం పన్నులు పెంచలేదు.. మేమెందుకు తగ్గిస్తాం?రూ.60 ఉన్న పెట్రోల్ను రూ.110 చేసింది భాజపానే. తగ్గించాల్సిన బాధ్యత కూడా భాజపాదే. మేం దోచుకుంటాం.. మీరు తగ్గించుకోండి అంటే ఎలా?వ్యాట్ తగ్గిస్తే రాష్ట్రం కోల్పోయే ఆదాయం కేంద్రం ఇస్తుందా?పెట్రో ధరలపై వచ్చే సొమ్మును కేంద్రం భాజపా పాలిత రాష్ట్రాలకు పంచుతోంది. చంద్రబాబు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఫలితం ఉంటుంది’’ అని కొడాలి నాని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!