Ts News: సొంత స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్

సొంత స్థలం ఉన్నవారికి వెంటనే రెండు పడక గదలు ఇళ్లు మంజూరు చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వా్న్ని కోరారు. ..

Updated : 28 Nov 2021 15:42 IST

సూర్యాపేట: సొంత స్థలం ఉన్నవారికి వెంటనే రెండు పడక గదలు ఇళ్లు మంజూరు చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వా్న్ని కోరారు. సూర్యాపేటలో ఈటల మీడియాతో మాట్లాడారు. 2014లో రాష్ట్ర అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పు రూ.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రతి నెల రూ.65వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. విద్యార్థుల హాస్టల్‌ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెరాసను భూస్థాపితం చేయడం ఖాయమని ఈటల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని