AP News: వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తా: చంద్రబాబు

రాష్ట్రంలో భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో తర్వలోనే పర్యటించనున్నట్టు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆయన

Updated : 23 Nov 2022 11:50 IST

అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో తర్వలోనే పర్యటించనున్నట్టు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో  సమీక్షించారు. వరద బాధితులకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, మందులు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. తెదేపా శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని