TS News: బండి సంజయ్ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనను తెరాస
సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనను తెరాస శ్రేణులు మరోసారి అడ్డుకునేందుకు యత్నించాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి సెంటర్లో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. భాజపా శ్రేణులపై తెరాస కార్యకర్తలు రాళ్లు రువ్వారు. బండి సంజయ్కు స్వాగతం పలికేందుకు వచ్చిన భాజపా శ్రేణులపై తెరాస వర్గీయులు కర్రలతో దాడికి యత్నించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అంతకుముందు చివ్వెంలలో ఇదే పరిస్థితి తలెత్తింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పోటీగా తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఆత్మకూరు (ఎస్)లో ఉద్రిక్త వాతావరణం..
పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)కు చేరుకున్న బండి సంజయ్కి మరోసారి తెరాస శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. బండి సంజయ్ని అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ తెరాస శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. బండి సంజయ్ రాకతో ఆత్మకూరు (ఎస్)లోని ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది. అక్కడ భాజపా, తెరాస శ్రేణులు భారీగా మోహరించాయి. భాజపా, తెరాస కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆత్మకూరు(ఎస్) వద్ద ఘర్షణ జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కు గుండెపోటు వచ్చింది. వెంటనే శ్రీనివాస్ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.
బండి సంజయ్పై కేసు నమోదు: నల్గొండ ఎస్పీ
బండి సంజయ్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు. అనుమతి లేకుండా పర్యటించారని సంజయ్తో పాటు పలువురు భాజపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం