Politics: కాంగ్రెస్ 300 సీట్లలో గెలవడం కష్టమే..: గులాంనబీ ఆజాద్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో (2024) కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై హామీ ఇవ్వలేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత
జమ్మూ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో (2024) కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 300లోక్సభ స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక్కడి భూమిని, ఉద్యోగాలను కాపాడుకోవడమే తమకు ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.
‘ఆర్టికల్ 370 అంశంపై పార్లమెంటులో ఎన్నో ఏళ్లనుంచి తానొక్కడినే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ప్రజలను మభ్యపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఎదోఒక హామీ ఇవ్వలేను’ అని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని సుప్రీంకోర్టు మాత్రమే తేలుస్తుందన్న ఆయన.. కోర్టుతోపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రమే దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోగలదన్నారు. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వమే దాన్ని రద్దు చేసినందున వారు వెనక్కివెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని మాపార్టీ అధికారంలోకి వచ్చాక ఆపని చేస్తామని హామీ ఇవ్వడానికి, అలాంటి అవకాశాలు కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లలో విజయం సాధించాలనే నేను కోరుకుంటున్నా. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇక జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పక్షాలు ఏకం కావాలని అక్కడి పార్టీలకు ఆజాద్ సూచించారు.
ఇదిలాఉంటే, జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని వ్యతిరేకిస్తోన్న అక్కడి విపక్ష పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామనే అనధికారిక హామీలు ఇస్తున్నాయి. అయితే, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?