తృణమూల్ కాంగ్రెస్లో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
పశ్చిమ్ బెంగాల్లో భాజపాపై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న టీఎంసీ.. దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆయనతో పాటు నటి నఫీసా ఆలీ కూడా ఈ రోజు పార్టీలో చేరారు.
గోవాలో పర్యటిస్తోన్న మమతా బెనర్జీ
దిల్లీ: పశ్చిమ్ బెంగాల్లో భాజపాపై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న టీఎంసీ.. దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆయనతో పాటు నటి నఫీసా ఆలీ కూడా ఈ రోజు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తాను ఇక్కడకు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదని, భాజపా దాదాగిరికి చెక్ పెట్టేందుకని కొంకణీ భాషలో మాట్లాడి గోవా వాసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘ నేను బయట వ్యక్తిని కాదు. భారతీయురాలిని. నేను ఎక్కడికైనా వెళ్లగలను. బెంగాల్ నా మాతృభూమి అయితే, గోవా కూడా మాతృభూమే. నేను గోవా సీఎం అయ్యేందుకు రాలేదు. దిల్లీ నుంచి ఎదురయ్యే దాదాగిరిని అడ్డుకోవడానికి వచ్చాను. వారి మనసు కలుషితమైంది. వారు నాకు నల్లజెండాలు చూపించారు. నేను మాత్రం వారికి నమస్కారమే పెట్టాను’ అని భాజపాపై విమర్శలు చేశారు. ‘మనం ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. గోవా చాలా అందంగా ఉంటుంది. మనకు చేపలంటే ఇష్టం. మన రెండు రాష్ట్రాలు ఫుట్బాల్ను ప్రేమిస్తాయి’ అంటూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సారుప్యాలను వెల్లడించారు. అలాగే లియాండర్ పేస్ చేరిక గురించి మాట్లాడుతూ..‘లియాండర్ పేస్ టీఎంసీలో చేరారని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాకు సోదర సమానుడు. నేను యువజన శాఖ మంత్రిగా ఉన్పప్పటి నుంచే ఆయన నాకు తెలుసు’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం రాజధాని నగరం పనాజీలో జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM