Mayawati: వచ్చే ఎన్నికల్లో.. బాహుబలులు, మాఫియాకు నో టికెట్..!
వచ్చే ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేతలకు తమ పార్టీ నుంచి టికెట్ ఇచ్చేదే లేదని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు.
స్పష్టం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
లఖ్నవూ: వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాయి. ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు, అభ్యర్థుల జాబితాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేతలకు తమ పార్టీ నుంచి టికెట్ ఇచ్చేదే లేదని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి తమ పార్టీ తరపున మరోసారి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మవూ అసెంబ్లీ స్థానం నుంచి ముక్తార్ అన్సారీ స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీం రాజ్భర్ను పోటీలో దింపుతామని మాయావతి ప్రకటించారు. ముక్తార్ అన్సారీ సోదరుడు సిగ్బతుల్లా అన్సారీ సమాజ్వాదీ పార్టీ (SP) లో చేరిన నేపథ్యంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయంలో పార్టీ ఇంఛార్జీలు మాఫియా నేపథ్యం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం ఏర్పడ్డాక అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఎటువంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు.
మాజీ గ్యాంగ్స్టర్గా పేరొందిన ముక్తార్ అన్సారీ, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీఎస్పీ తరపున పోటీ చేసిన ఆయన.. మవూ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనపై ఉత్తర్ప్రదేశ్తో పాటు సమీప రాష్ట్రాల్లో కలిపి దాదాపు 52 కేసులు ఉన్నట్లు సమాచారం. వాటిలో దాదాపు 15 కేసులు విచారణ దశలో ఉండగా.. ప్రస్తుతం అన్సారీ బందా జైలులో ఉన్నారు. ముక్తార్ అన్సారీ మరో సోదరుడు అఫ్జల్ అన్సారీ మాత్రం బీఎస్పీ తరపున ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. భాజాపా అభ్యర్థి, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హాను క్రితం ఎన్నికల్లో అఫ్జల్ అన్సారీ ఓడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్