Ap News: వర్సిటీల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదు: ఆదిమూలపు సురేశ్‌

నూతన సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ మరింత పటిష్ట పరిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు

Published : 01 Dec 2021 01:42 IST

అమరావతి: నూతన సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ మరింత పటిష్ట పరిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 11 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో సీఎం జగన్ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. చేపట్టిన ప్రతి మంచి పనికీ తెదేపా అడ్డుతగలడం దురదృష్టకరమన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. అన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తన పరిధిలో లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. వర్సిటీల్లో ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదన్నారు. సీఎం జగన్‌పై తెదేపా నేతల విమర్శలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేయడం మానేసి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని విపక్షాలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని