Ap News: వర్సిటీల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదు: ఆదిమూలపు సురేశ్
నూతన సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ మరింత పటిష్ట పరిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు
అమరావతి: నూతన సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ మరింత పటిష్ట పరిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 11 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో సీఎం జగన్ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. చేపట్టిన ప్రతి మంచి పనికీ తెదేపా అడ్డుతగలడం దురదృష్టకరమన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. అన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తన పరిధిలో లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. వర్సిటీల్లో ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదన్నారు. సీఎం జగన్పై తెదేపా నేతల విమర్శలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేయడం మానేసి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని విపక్షాలను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?