KTR: కేటీఆర్, రాజాసింగ్‌ మధ్య ట్వీట్‌ వార్

మంత్రి కేటీఆర్‌, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మధ్య ట్విటర్‌ వేదికగా సంవాదం నడిచింది.

Updated : 30 Sep 2022 15:23 IST

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. పాతబస్తీలో పర్యటనకు కేటీఆర్‌ బైక్‌పై రావాలని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ అసెంబ్లీలో చెప్పారని రాజాసింగ్‌ అన్నారు. సర్కారు అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తాం అని తెలిపారు. కాగా ఈ ట్వీట్‌కు కేటీఆర్‌ బదులిచ్చారు. పెట్రోల్‌ ధరల పెంపుపై ప్రజలు ఏమంటున్నారో ఎందుకు తెలుసుకోవట్లేదు అని కౌంటర్‌ ఇచ్చారు. గ్యాస్‌ ధర పెంపుపై ఇళ్ల వద్ద ఆగి తెలుసుకోవాలన్నారు. జీడీపీ అంటే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ పెరుగుదల అంటున్నారన్నారు. మాటల గారడి ఆపి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని కేటీఆర్‌.. రాజాసింగ్‌కు హితవు పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని