Third Front: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు..!
దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ తప్పనిసరి అని చెబుతున్న పలు ప్రాంతీయ పార్టీలు అందుకు తగ్గట్లుగానే ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
సెప్టెంబర్ 25న ఒకే వేదికపైకి కీలక నేతలు
దిల్లీ: దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ తప్పనిసరి అని చెబుతున్న పలు ప్రాంతీయ పార్టీలు అందుకు తగ్గట్లుగానే ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) అధినేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 25న జరిగే మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతిని ఇందుకు వేదికగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడతో పాటు శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ హాజరయ్యేందుకు ఇప్పటికే అంగీకరించారు.
ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలకు ఆహ్వానం పంపినప్పటికీ హాజరయ్యే విషయంపై వారినుంచి స్పష్టత రావాల్సి ఉందని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా తెలిపారు. దేశంలో భాజపా, కాంగ్రెస్యేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా సారూప్యత కలిగిన పార్టీలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రజా సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం తృతీయ ఫ్రంట్ అవసరమనే ఉద్దేశంతోనే పార్టీలన్నీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఐఎన్ఎల్డీ నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం