UP Elections: విద్యార్థినులకు ఉచిత స్కూటీ, స్మార్ట్ఫోన్!
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40శాతం మహిళకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా అక్కడి విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్ఫోన్లను అందిస్తామని ప్రకటించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు ప్రకటించిన ప్రియాంకా గాంధీ
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అక్కడి యువతులు, మహిళలనే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40శాతం మహిళకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా అక్కడి విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. వీటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపింది.
‘నిన్న కొంతమంది విద్యార్థినులను కలిశాను. వారు చదువుకోవడానికి, భద్రతకు స్మార్ట్ఫోన్లు అవసరమని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ పాసైన విద్యార్థినులకు స్మార్ట్ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు అందించాలని యూపీ కాంగ్రెస్ నిర్ణయించింది. వీటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం సంతోషంగా ఉంది’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనతో మాట్లాడిన తర్వాత విద్యార్థినుల స్పందనకు సంబంధించిన వీడియోను ప్రియాంకా గాంధీ ట్విటర్లో షేర్ చేశారు. ‘ప్రియాంకా గాంధీని కలిసినపుడు ఎవరిదగ్గరైనా సెల్ఫోన్ ఉంటే సెల్ఫీ తీసుకోవచ్చని అడిగారు. కానీ, మా దగ్గర సెల్ఫోన్లు లేవని, వాటిని కాలేజీలో అనుమతించరని ఆమెతో చెప్పాం. అమ్మాయిలకు ఫోన్లు ఉండాలని.. వాటిని ఇచ్చేందుకు త్వరలోనే పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. దాంతో మా భద్రత కోసం అంతకన్నా ఇంకా ఏం కావాలని బదులిచ్చాం’ అని యూపీ విద్యార్థినులు మీడియాతో వెల్లడించారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. కష్టపడి చదవాలని ప్రియాంకా గాంధీ మాతో చెప్పారు. ఇదే విధంగా మాతో కలవడం, మాట్లాడడం..తదితర కార్యక్రమాలను ప్రియాంకా గాంధీ మున్ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నానని సదరు విద్యార్థిని అభిప్రాయపడింది.
ఇదిలాఉంటే, ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. ఓవైపు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అక్కడ రైతులు చేస్తోన్న ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే విద్యార్థినులకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలను ఉచితంగా పంపిణీ చేస్తామని తాజాగా ప్రియాంకా గాంధీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం