Smriti Irani: ఇంట్లో ఉన్న అబ్బాయి పోరాడకుండా కూర్చున్నాడు..!
అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికల వేళ కీలకంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
ప్రియాంకాగాంధీకి కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ
దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికల వేళ కీలకంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
‘నేను మహిళను. నేను పోరాడగలను’ అంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యకు స్మృతి స్పందిస్తూ..‘ఇంట్లో అబ్బాయి ఉన్నాడు. కానీ పోరాడలేడు’ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే అని ప్రియాంక చేసిన ప్రకటనపై స్పందించారు. మహిళలకు 60 శాతం సీట్లు ఇవ్వడం ఇష్టంలేదని ప్రియాంక మాటలను బట్టి తెలుస్తోందన్నారు. అలాగే మహిళా నేతలు సమాజంలోని తోటి మహిళల కోసమే పనిచేయాలని ఆశించకూడదన్నారు ‘మహిళలు ఎవరైనా సరే రాజ్యాంగపరమైన బాధ్యత పొందినప్పుడు.. వారు మహిళల కోసం ఎంత పనిచేస్తారో, పురుషులు, పిల్లలు, వృద్ధుల కోసం కూడా అంతే పనిచేయాల్సి ఉంది’ అని వెల్లడించారు. ఈ సారి యూపీ ఎన్నికలు అభివృద్ధి అనే అంశంపైనే జరుగుతాయన్నారు. అలాగే ఇటీవల పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఇరానీ తప్పుపట్టారు. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్, జిన్నాను పోల్చడం సరికాదని విమర్శించారు. ఒకరు ముక్కలుగా ఉన్న దేశాన్ని కలిపితే.. మరొకరు మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం