AP News: కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. విజయనగరంలో అశోక్గజపతిరాజు ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంటి ఎదుట తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అనంతపురంలో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని మండిపడ్డారు. ఇంత దారుణమైన ప్రభుత్వా్న్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు తాగిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను తెదేపా నేతలు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
పశ్చిమ గోదావరిలో పురుగుల మందు తాగిన కార్యకర్త..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తెలుగుదేశం అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. చంద్రబాబుపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్త నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం తట్టుకోలేక ఈ పని చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే నాగేశ్వరరావును కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.
*గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు సీఎం జగన్, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. చిలకలూరిపేట తెదేపా కార్యాలయం నుంచి ఎంఆర్టీ సెంటర్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్టీ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడే దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.