Chandrababu: వరద బాధిత ప్రాంతాల పర్యటన.. కడప చేరుకున్న చంద్రబాబు 

వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు కడప చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.

Updated : 23 Nov 2021 15:49 IST

కడప: వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు కడప చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.  విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. అనంతరం చంద్రబాబు రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. ఈరోజు మొత్తం కడప జిల్లాల్లో పర్యటించనున్న తెదేపా అధినేత.. రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని