ఆ ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్రెడ్డి, బండి సంజయ్ను సన్మానిస్తా: గంగుల కమలాకర్
యాసంగిలో పండే ప్రతి పంట కొనేలా కేంద్రంపై రాష్ట్ర భాజపా నేతలు ఒత్తిడి తేవాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ..
కరీంనగర్: యాసంగిలో పండే ప్రతి పంట కొనేలా కేంద్రంపై రాష్ట్ర భాజపా నేతలు ఒత్తిడి తేవాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12 అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కరీంనగర్లో జిల్లాలోని తెరాస ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం అనంతరం కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలపక్షాన ధర్నా చేసే పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందన్నారు.
పంట కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేర్వేరుగా చెబుతున్నారని.. దీనిపై స్పష్టత ఇవ్వాలనే ధర్నాలు చేపడుతున్నట్లు చెప్పారు. తమ ఆందోళనకు భాజపా నేతలు కూడా సంఘీభావం తెలపాలన్నారు. యాసంగిలో ఏ పంట అయినా మద్దతు ధర ఇచ్చి కొనేలా కేంద్ర ప్రభుత్వంపై భాజపా నేతలు ఒత్తిడి తేవాలని.. ప్రతి గింజా కొనేలా కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్రెడ్డి, బండి సంజయ్ను తానే సన్మానిస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.