Revanth Reddy: తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్రెడ్డి
ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెరాస ఎంపీలు
దిల్లీ: ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెరాస ఎంపీలు తూతూ మంత్రంగా నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. దిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. సభ వాయిదా పడిన సమయంలో తెరాస ఎంపీలు సెంట్రల్హాల్లో ప్లకార్డులతో ఫొటోలు దిగి పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆక్షేపించారు. ప్రజల్ని మభ్యపెడుతూ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా నిరసన తెలపాలనుకుంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు దిల్లీ రావడం లేదని.. సంబంధిత శాఖామంత్రులు, ప్రధానిని ఎందుకు కలిసి నిలదీయడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి