TS News: తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ: రేవంత్రెడ్డి
తెలంగాణ శాసనమండలి తెరాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి తెరాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు అక్రమాలు చేశారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారికి వివరించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆన్లైన్లో ఉంచాలి. ఇంకా పత్రాలను ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు? తెరాస అభ్యర్థులపై ఉన్న కేసులను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా తెరాస కనుసన్నల్లోనే నడుస్తోంది. మా అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు స్పందించట్లేదు. అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.
వెంకట్రామిరెడ్డి విషయంలో సర్వీసు నిబంధనలు పాటించలేదు. ఆయనపై ఉన్న ఆరోపణలు తేలిన తర్వాతే రాజీనామాను ఆమోదించాలి. వెంకట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో బహిర్గతం చేయాలి. వెంకట్రామిరెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయి, ఒక కేసులో జరిమానా విధించారు. ఒక్క కేసు కూడా లేనట్లు వెంకట్రామిరెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిసింది’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా..
‘‘వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్గా ఉండి అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారు. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికీ పలు కేసులు ఉన్నాయి. మండలి ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి పిటిషన్ను తిరస్కరించాలి. అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారు’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట