Mamata Banerjee: యూపీఏనా..? అలాంటిదేమీ లేదు..మమత స్టేట్మెంట్
భాజపాకు ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమె మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు
ముంబయి: భాజపాకు ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమె మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను ముంబయిలో ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి..? యూపీఏ లాంటిదేమీ లేదు’ అని అన్నారు. భాజపాను ఓడించాలంటే ప్రత్యామ్నాయం అవసరమని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సమావేశం గురించి శరద్ పవార్ కూడా స్పందించారు. ‘నేను, నా బృందం మమతతో సుదీర్ఘంగా సంభాషించాం. ఒకే ఆలోచనా విధానం ఉన్న శక్తులన్నీ జాతీయ స్థాయిలో కలిసి రావాలని, సమష్టిగా నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఆమె ఉద్దేశం. అంతా కలిసి బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన ఈ ఒక్కరోజు కోసం కాదు. ఇది ఎన్నికలను ఉద్దేశించి జరగాలి’ అని పవార్ వ్యాఖ్యానించారు.
షారుక్ ఖాన్ బాధితులుగా మారారు..
భాజపాను విమర్శించే విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆమె.. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ‘భారతదేశం ప్రజా బలాన్ని ప్రేమిస్తుంది. కండ బలాన్ని కాదు. మనం ఇప్పుడు భాజపా అనే క్రూరమైన అప్రజాస్వామిక పార్టీని ఎదుర్కొంటున్నాం. మనం కలిసుంటే.. మనం గెలుస్తాం. మహేశ్ జీ (మహేశ్ భట్), షారుఖ్ ఖాన్ బాధితులుగా మారారు. మనం గెలవాలంటే.. మనం పోరాడాలి’ అంటూ మమత మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బెంగాల్కు చెందిన ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై రాసిన కవిత గురించి ప్రస్తావించారు.
కాంగ్రెస్ లేకుండా భాజపాను ఓడించడం ఓ కల
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే భాజపాను ఓడించడం తేలికేనంటూ దీదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లేకుండా భాజపాను ఓడించడం ఓ కలేనన్నారు. భారత రాజకీయాల్లో వాస్తవికత అందరికీ తెలిసిందేనన్న వేణుగోపాల్.. కాంగ్రెస్ లేకుండా ఎవరైనా భాజపాను ఓడించగలరనేది కేవలం ఓ కల మాత్రమేనని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM