YS Sharmila: పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు.: షర్మిల
సైదాబాద్ హత్యాచార ఘటనలో ఏడు రోజులైనా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. లోటస్పాండ్లోని
హైదరాబాద్: సైదాబాద్ హత్యాచార ఘటనలో ఏడు రోజులైనా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ...
‘‘మా ఒత్తిడి వల్లే మంత్రుల్లో కదలిక వచ్చింది. వారి ఇంటికి వెళ్లి పరిహారం ఇవ్వడంతో పాటు, కేసు కొలిక్కి వచ్చేలా చేసింది. శాంతి యుతంగా దీక్ష చేస్తుంటే రాత్రి 2గంటల సమయంలో దాదాపు 200 మంది పోలీసులు మాపై దాడికి దిగి అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణలో లేదా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వ తీరు తాలిబన్ల వ్యవహారశైలిని తలపిస్తోంది. తాలిబన్ల చేతిలో అఫ్గానిస్తాన్ బందీ అయినట్టు.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. పోలీసులు చేయలేని న్యాయం.. దేవుడు చేశాడు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి ఘటనలు ఆగవు. మద్యం అమ్మకాలను పెంచేందుకు ఉన్న చిత్త శుద్ధి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో లేదు’’ అని షర్మిల విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు