కొనసాగుతున్న మూడోదశ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలయింది.

Updated : 17 Feb 2021 12:08 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలయింది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల దాకా, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 దాకా పోలింగ్‌ కొనసాగనుంది.  13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో దశలో 3,221 గ్రామ పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు.

మావోయిస్టు ప్రాంతాల్లో భారీ భద్రత
మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 172 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్‌ 11 మండలాల్లోని 237 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.మావోయిస్టు  ప్రభావిత మండలాలైన పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి వీటిలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్‌లలోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని