కొనసాగుతున్న మూడోదశ పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ మొదలయింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ మొదలయింది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల దాకా, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 దాకా పోలింగ్ కొనసాగనుంది. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో దశలో 3,221 గ్రామ పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు.
మావోయిస్టు ప్రాంతాల్లో భారీ భద్రత
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని 172 గ్రామ పంచాయతీల్లో పోలింగ్కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్ 11 మండలాల్లోని 237 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది.మావోయిస్టు ప్రభావిత మండలాలైన పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి వీటిలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్