నంది(సం)గ్రామ్ రేపే
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ దశలో నందిగ్రామ్ సహా మొత్తం 30 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది.......
దీదీ Vs సువేందు: పైచేయి ఎవరిదో!
ఇంటర్నెట్ డెస్క్: యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ దశలో నందిగ్రామ్ సహా మొత్తం 30 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. కొవిడ్ నిబంధనలకనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్న ఈ రసవత్తర పోరులో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని దీదీ.. ఎలాగైనా పాగా వేయాల్సిందేనన్న పట్టుదలతో భాజపా ప్రచారం హోరెత్తించాయి. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలన్నీ దక్షిణ 24పరగణాస్, బంకురా, మేదినాపూర్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అందరిచూపూ నందిగ్రామ్పైనే నెలకొంది.
తృణమూల్ తరఫున సీఎం మమతా బెనర్జీ, గతంలో ఆమెకు కుడిభుజంగా ఉండి భాజపాలో చేరిన సువేందు అధికారి తలపడటంతో నందిగ్రామ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మమత తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీచేయడం.. అలాగే, ఆ ప్రాంత రాజకీయాలను శాసించే కుటుంబానికి చెందిన మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి భాజపా తరఫున బరిలో నిలవడంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నందిగ్రామ్లో దీదీని ఓడించాలన్న పట్టుదలతో భాజపా తీవ్రంగా శ్రమించగా.. ఎలాగైనా గెలిచి సువేందుకు కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని దీదీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెండు పార్టీలూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను హీటెక్కించాయి. గెలుపే లక్ష్యంగా సర్వశక్తుల్నీ ధారపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో నందిగ్రామ్ ప్రజలు ఈసారి దీదీని ఆశీర్వదిస్తారా? లేదంటే మళ్లీ సువేందుకే ఛాన్స్ ఇస్తారో చూడాలి.
రెండో విడత ఎన్నికలు జరగనున్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 171మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 152మంది పురుషులు కాగా 19మంది మహిళా అభ్యర్థులు. నందిగ్రామ్ నుంచి సీఎం మమతా బెనర్జీ, భాజపా నుంచి సువేందు అధికారి బరిలో నిలవగా.. లెఫ్ట్ఫ్రంట్ అభ్యర్థిగా మీనాక్షి ముఖర్జీ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నందిగ్రామ్లో ఇప్పటివరకు వామపక్షాలు ఎనిమిది సార్లు గెలవగా.. తృణమూల్ మూడు పర్యాయాలు విజయం సాధించింది. పశ్చిమబెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడతలో 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. గురువారం మరో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
మరోవైపు, అసోంలోనూ రేపు రెండో విడత ఎన్నికలు 39 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మొత్తం 126 స్థానాలు కలిగిన అసోంలో ఎన్నికల సంఘం ఈసారి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 27న తొలి విడతలో 47 స్థానాలకు ఎన్నిక ఎన్నికలు జరగ్గా.. రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న మరో 40 స్థానాల్లో మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ