‘లఖింపుర్ దోషుల్ని 7రోజుల్లో అరెస్టు చేయకపోతే మోదీ ఇంటిని ముట్టడిస్తాం!’
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్ సమాజ్వాదీ పార్టీ చీఫ్, దళిత నాయకుడు........
ఆజాద్ సమాజ్వాదీ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరిక
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్ సమాజ్వాదీ పార్టీ చీఫ్, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి విషయంపైనా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లు చేస్తారనీ.. మరి, రైతుల్ని చంపిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ లఖ్నవూలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్న వేళ రైతుల కుటుంబాలు అక్కడ రోదిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ లఖింపుర్ ఖేరి వెళ్లి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించాలని కోరారు. యూపీలో శాంతిభద్రతలు లేవని, సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆజాద్ డిమాండ్ చేశారు.
ఆ కేంద్రమంత్రిని బర్త్రఫ్ చేయాల్సిందే..: కాంగ్రెస్ డిమాండ్
లఖింపుర్ ఖేరి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి డిస్మిస్ చేయాలని, ఆయన కుమారుడు అశీష్ని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో దర్యాప్తు జరిపించి బాధిత రైతుల కుటుంబాలకు 30 రోజుల్లో న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించి.. నిందితులను అరెస్టు చేయించాలన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేసి.. నిందితుందరినీ అరెస్టు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో కమిషన్ ఏర్పాటు చేసి దోషులను 30 రోజుల్లో శిక్షిస్తేనే రాజ్యాంగం, చట్టం పరిరక్షించబడతాయన్నారు. లేకపోతే వాటిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడినీ అరెస్టు చేయలేదని సూర్జేవాలా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!