Amarinder: సిద్ధూని మాత్రం సీఎం కానివ్వనంతే.. అందుకు ఎలాంటి త్యాగానికైనా రె‘ఢీ’!
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సిద్ధూపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ యుద్ధం ప్రకటించారు......
చండీగఢ్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్సిద్ధూపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ యుద్ధం ప్రకటించారు! ఎట్టిపరిస్థితుల్లో ఆయన్ను సీఎంని కానివ్వబోనన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానన్నారు.సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని ప్రకటించారు. సిద్ధూతో పంజాబ్కు, ఈ దేశానికే ప్రమాదమన్న కెప్టెన్.. ఆయన్ను సీఎం కానీయకుండా అడ్డుకొనేందుకు ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమేనన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాకు అంతగా అనుభవం లేదని, వారి సలహాదారులు తప్పుదారి పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంక తన పిల్లల్లాంటివారేనన్నారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదన్న కెప్టెన్.. తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను గోవాకో, ఇంకే ప్రాంతానికో విమానంలో తీసుకెళ్లే పని తనకు చేతకాదని, జిమ్మిక్కులు చేయడం తెలియదన్నారు. తన గురించి గాంధీ కుటుంబానికి బాగా తెలుసన్నారు.
పార్టీలో అంతర్గత కలహాలు, సిద్ధూతో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న వేళ ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో ‘కెప్టెన్’ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు అవమానానికి గురయ్యానని, ఇకపై అలాంటివి భరించలేనంటూ రాజీనామా సందర్భంగా అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత దళిత నేత, సిద్ధూ శిబిరానికి చెందిన చరణ్జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?