UP Polls: భాజపా ఎన్నికల సాంగ్స్ విడుదల.. బులంద్షహర్లో కాంగ్రెస్కు బిగ్ షాక్!
మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్ప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల రాజకీయ వలసలు ఊపందుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, .......
లఖ్నవూ: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్ప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల రాజకీయ వలసలు ఊపందుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో యూపీలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార భాజపా.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి మరింతగా దూసుకెళ్లేందుకు శుక్రవారం ఎన్నికల పాటలను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కమలదళం ఎన్నికల పాటలను లఖ్నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో రాష్ట్ర శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించి గత ప్రభుత్వాల అండతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఇప్పుడు బహిరంగంగా రహదారులపై తమ పోస్టర్లను అతికిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాము అందరి అభివృద్ధి కోసం పనిచేశాం తప్ప ఏ ఒక్కరికోసమో కాదన్నారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాల హయాంలో చక్కెరమిల్లులు మూతపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వమే చెరకు రైతులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఇచ్చిందన్నారు. 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఈ సందర్భంగా యోగి స్పష్టంచేశారు.
అమిత్ షా ఇంటింటి ప్రచారం రేపు!
మరోవైపు, దేశ రాజకీయాలను శాసించే యూపీలో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం యూపీ పర్యటనకు రానున్నారు. కైరానా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు స్థానిక నేతలతో సమావేశమవుతారు. అలాగే, షామిలి, బాఘ్పట్లలో కూడా భాజపా కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఆ తర్వాత మేరఠ్లో ప్రముఖ వ్యక్తులతోనూ అమిత్ షా సమావేశం కానున్నారు.
బులంద్ షహర్లో కాంగ్రెస్కు షాక్!
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్ తగిలింది. బులంద్షహర్లో ఆ పార్టీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాజీనామా చేసినట్టు సమాచారం. బులంద్షహర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు షియోపాల్ సింగ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ వాల్మికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనూప్షహర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని షియోపాల్ సింగ్ కోరగా.. అందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఆ స్థానంలో బీఎస్పీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల తమ పార్టీలో చేరిన చౌదురి గజేంద్రసింగ్ను బరిలో దించింది. గజేంద్రసింగ్ గత నెలలోనే ఆర్ఎల్డీలో చేరగా.. అక్కడ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ చేరడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి