ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది అతడే..
టీమ్ఇండియా క్రికెట్లో మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే విషయం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది...
పూర్తిస్థాయి వికెట్ కీపర్ ఎవరో చెప్పిన ఆకాశ్చోప్రా
ఇంటర్నెట్డెస్క్: మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే విషయం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై అటు క్రికెట్ వర్గాల్లో ఇటు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జట్టుకు కీపర్గా వ్యవహరించే క్రమంలో రిషభ్పంత్ గతేడాది విఫలమవ్వగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ ఏడాది ఆరంభంలో కేఎల్ రాహుల్ ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. దీంతో అందరి కళ్లూ ఇప్పుడు అతగాడిపై పడ్డాయి. కానీ, టాప్ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అతడు 50 ఓవర్ల పాటు కీపింగ్ చేయడం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు.
తొలుత సాహా పేరు ప్రస్తావించిన చోప్రా.. కేవలం టెస్టుల వరకే పనికొస్తాడని చెప్పాడు. 2014లో మాజీ సారథి టెస్టుల నుంచి తప్పుకున్నాక బెంగాల్ కీపర్ ఆ బాధ్యతలను స్వీకరించాడని గుర్తుచేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే ఇద్దరు ఉన్నారని.. వారే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ అని పేర్కొన్నాడు. వీళ్లిద్దరు కాకుండా భవిష్యత్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారన్నాడు. ‘కేఎల్ రాహుల్ పూర్తిస్థాయి బ్యాట్స్మన్గానే కొనసాగుతాడు.. కీపర్గా కాదు. ఎందుకంటే 50 ఓవర్ల పాటు కీపింగ్ చేసి మళ్లీ ఓపెనర్గా దిగడమనేది చాలా కష్టం. కాబట్టి పంతే తొలి ప్రాధాన్యం. అతడి తర్వాత శాంసన్, ఇషాన్’ అని చోప్రా వివరించాడు.
అనంతరం మరో అభిమాని ‘ఈసారి ఐపీఎల్లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ పెయిర్?’ ఎవరని అడగ్గా.. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ రోహిత్శర్మ-క్వింటన్ డికాక్ లేదా రోహిత్-క్రిస్లిన్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్-జానీ బెయిర్స్టో, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు చెందిన క్రిస్గేల్-కేఎల్ రాహుల్ జోడీ పేర్లను వెల్లడించాడు. చివరగా మరో అభిమాని ఇంకో ప్రశ్న సంధించాడు. ఆర్సీబీలో ఈసారి ఎక్స్ ఫాక్టర్ (కీలక) ఆటగాడు ఎవరని అడ్గా.. మోయిన్ అలీ పేరును వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?