‘పంత్, రాహుల్ బాగా నిద్రపోయి ఉంటారు’
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్జోన్స్ హాస్యాస్పదంగా స్పందించాడు...
ధోనీ రిటైర్మెంట్ తర్వాత డీన్జోన్స్ ట్వీట్
ఇంటర్నెట్డెస్క్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్జోన్స్ హాస్యాస్పదంగా స్పందించాడు. తాజాగా అతడు ఓ ట్వీట్ చేస్తూ టీమ్ఇండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఆ రాత్రి బాగా నిద్రపోయి ఉంటారని పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం భారత జట్టుకు మిడిల్ఆర్డర్ బ్యాట్స్మన్గానే కాకుండా అత్యుత్తమ వికెట్ కీపర్గానూ ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత కాలంగా అతడి తర్వాత కీపింగ్ బాధ్యతలను ఎవరు చేపడతారనే విషయంపై చర్చలు జరిగాయి. అయితే, ఆ సమయంలో యువ కీపర్ రిషభ్పంత్ వైపే అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ, గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ ఆటకు దూరమవ్వడంతో ఆ సమయంలో కీపింగ్ చేసిన పంత్ విఫలమయ్యాడు.
ఇదే క్రమంలో ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా టీమ్ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ను పరీక్షించింది. అతడు కీపర్గా మంచి ప్రదర్శన చేసి అందరి ప్రశంసలూ అందుకున్నాడు. దీంతో రాహుల్ కీపర్గా, బ్యాట్స్మన్గా పనికొస్తాడని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే జట్టు యాజమాన్యం రాహుల్ను కొంత కాలం అలా కొనసాగిస్తే పంత్కు ఇబ్బంది కరమే. అలా కాకుండా రాహుల్ను బ్యాట్స్మన్గా కొనసాగించి, మళ్లీ పంత్నే కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అతడు మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ధోనీ వదిలేసిన స్థానం కోసం వారిద్దరూ పోటీపడుతున్నట్లు జోన్స్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు