క్యాస్ట్రో మరణించిన సరిగ్గా నాలుగేళ్లకు డీగో..!
ఇతడేమో ఫుట్బాల్ దిగ్గజం. అతడేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి...
ఒకే తేదీన స్నేహితుల మరణం
ఇంటర్నెట్డెస్క్: ఒకరేమో ఫుట్బాల్ దిగ్గజం. మరొకరేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ, ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి అనుబంధం ఏర్పర్చుకున్నారు. చివరికి ఒకే రోజు(నవంబర్ 25) ప్రాణాలు విడిచి మరణంలోనూ ఒక్కటయ్యారు. ఆ ఇద్దరే అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ లెజెండ్ డీగో మారడోనా, క్యూబా మాజీ దేశాధినేత ఫిడెల్ క్యాస్ట్రో. డీగో బుధవారం తుదిశ్వాస విడువగా క్యాస్ట్రో సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజు కన్నుమూశారు.
స్నేహితులే కాదు అంతకుమించి..
క్యూబా దివంగత నేత ఫిడెల్ క్యాస్ట్రో అంటే డీగోకు అమితమైన గౌరవం. నాలుగేళ్ల కిందట ఆయన మృతిచెందారని తెలిసి ఈ అర్జెంటీనా స్టార్ కంటతడి పెట్టాడు. తన తండ్రి మృతి తర్వాత అంతటి బాధ కలిగించిన సంఘటన ఇదేనని అప్పట్లో పేర్కొన్నాడు. అయితే, డీగో అంతలా భావోద్వేగం చెందడానికి ఓ బలమైన కారణమే ఉంది. అతడాడే రోజుల్లో మత్తు పదార్థాలకు బానిసవ్వగా 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దాంతో 15 నెలల పాటు నిషేధం వేటు పడి ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కూడా డీగో వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. దీంతో పలుమార్లు అనారోగ్యానికి గురై దాదాపు మృత్యువు అంచుల వరకూ వెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లోనే తన చికిత్సకు చేయూతనందించిన ఫిడెల్ క్యాస్ట్రో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడని ఆ సందర్భంలో డీగో పేర్కొన్నాడు.
ఆ స్నేహం చిగురించింది అప్పుడే..
డీగో 1986 ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనాను గెలిపించాక తన అభిమాన కమ్యూనిస్ట్ నేత ఫిడెల్ క్యాస్ట్రోను తొలిసారి కలిశాడు. తర్వాత వారిద్దరూ పెద్దగా కలవకపోయినా ఫిడెల్ అంటే అతడికి అభిమానమే. అయితే, 2000ల సంవత్సరం తర్వాత దగ్గరయ్యారు. మత్తుపదార్థాలకు బానిసైన డీగో అనారోగ్యానికి గురవడంతో అర్జెంటీనాలో చికిత్స పొందడానికి అవకాశం లేకపోయింది. అలాంటి విపత్కర సమయంలో క్యూబా అధినేత తన చికిత్సకు సహకరించారని, అలా క్యూబాలో చికిత్స పొందే సమయంలోనే తమ మధ్య స్నేహం పెరిగిందని డీగో అప్పుడు వివరించాడు. ఫిడెల్ తనని ఉదయపు నడకకు ఆహ్వానించేవారని, అప్పుడప్పుడూ తమ మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చేవని చెప్పాడు. తామిద్దరం రాజకీయ, క్రీడా అంశాలపై లోతుగా చర్చించేవాళ్లమన్నాడు. అలా తమ స్నేహం బలపడడమే కాకుండా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి క్యాస్ట్రో అని డీగో వెల్లడించాడు.
ఆ అభిమానమే పచ్చబొట్టు వేసుకునేలా చేసింది..
డీగో ఎవర్నైనా ఇష్టపడితే తన ఒంటిమీద వారి టాటూలు వేయించుకునే అలవాటు ఉంది. ఆ కారణంతోనే తన అభిమాన నాయకుడు, తిరుగుబాటు దారుడైన చేగువేరా టాటూను కుడిచేతిపై వేయించుకున్నాడు. అలాగే ఎడమకాలి మీద ఫిడెల్ బొమ్మను వేసుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి