కథ మారేందుకు ఒక్క సిక్సర్ చాలని తెలుసు
ఒక్క సిక్సర్తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్ సూపర్ హిట్టర్ రాహుల్ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు....
రాజస్థాన్ గెలుపు వీరుడు రాహుల్ తెవాతియా
షార్జా: ఒక్క సిక్సర్తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్ సూపర్ హిట్టర్ రాహుల్ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.
షార్జా వేదికగా జరిగిన మ్యాచులో మొదట పంజాబ్ 223/2 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్ (69; 54 బంతుల్లో 7×4, 1×6), పూరన్ (25*; 8 బంతుల్లో 1×4, 3×6) అద్భుతంగా ఆడారు. ఛేదనలో సంజు శాంసన్ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7×4 2×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పంజాబ్కు చుక్కలు చూపించాడు. తొలుత 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతడు కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి రాజస్థాన్ గెలుపు బాటలు వేశాడు. చివరి 12 బంతుల్లోనే 45 పరుగులు సాధించి విమర్శకుల నోటికి తాళం వేశాడు.
‘నేను బంతిని దూరంగా కొట్టగలనని డగౌట్లోని వారికి తెలుసు. నన్ను నేను నమ్మాలని భావించా. ఒక్క సిక్సర్ కొడితే అంతా మారిపోతుంది. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం మాత్రం అద్భుతమే. నిజానికి లెగ్స్పిన్లో షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. కానీ కుదర్లేదు. అందుకే మిగతా బౌలర్ల బౌలింగ్లో దంచేశా. ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నాను. మొదట 20 బంతుల్లో ఆడినట్టు ఎప్పుడూ ఆడలేదు. ఆ తర్వాత బాదడం షురూ చేశాను’ అని తెవాతియా చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM