320 పరుగులు చేసుంటే భారత్తో పోరాడేవాళ్లం
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 320 పరుగులు చేసుంటే టీమ్ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని శ్రీలంక ఆల్రౌండర్ ఏంజిలో మాథ్యుస్ పేర్కొన్నాడు...
2011 ప్రపంచకప్ ఫైనల్పై మాథ్యుస్ అభిప్రాయం
ఇంటర్నెట్డెస్క్: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 320 పరుగులు చేసుంటే టీమ్ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని శ్రీలంక ఆల్రౌండర్ ఏంజిలో మాథ్యుస్ పేర్కొన్నాడు. క్రికెట్ అన్ప్లగ్డ్ విత్ అనిస్ సాజన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆదివారం మాట్లాడిన అతడు తన అరంగేట్రం నాటి నుంచీ ఆస్ట్రేలియాలో శ్రీలంక వన్డే సిరీస్ విజయం సాధించేవరకు, అలాగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్తో పాటు లంక జట్టుకు కెప్టెన్గా మారిన అన్ని విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్పై స్పందించమని వ్యాఖ్యాత అడగ్గా.. తాను ఆ మ్యాచ్లో ఆడలేకపోయానని వాపోయాడు. గాయం కారణంగా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదన్నాడు. అదే తనకు తొలి వన్డే ప్రపంచకప్ అని , ఫైనల్లో ఆడకపోవడం బాధగా అనిపించిందని చెప్పాడు.
అనంతరం వ్యాఖ్యాత అందుకొని ఛేదనలో భారత్ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సందర్భంలో శ్రీలంక గెలుస్తుందని అనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మాథ్యుస్ ఇలా స్పందించాడు. భారత్లోని పిచ్లు, టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ పరిగణలోకి తీసుకుంటే శ్రీలంక 320 పరుగులు చేయాల్సి ఉండేదని తెలిపాడు. అలా చేసుంటే గట్టిపోటీ ఇచ్చేవాళ్లమన్నాడు. వాంఖడేలో పిచ్ అనుకూలిస్తుందని, ఒక్కసారి బ్యాట్స్మన్ కుదురుకుంటే అతడిని ఆపడం కష్టతరమని వివరించాడు. ఇక గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల భాగస్వామ్యం భారత్ను ఆదుకుందని, చివరికి ధోనీ మ్యాచ్ను ముగించాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, 2011 ప్రపంచకప్ ఫైనల్పై ఇటీవల శ్రీలంకలో విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటి క్రీడా శాఖ మంత్రి మహీందనంద వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో మహీందనందతో పాటు పలువురు క్రికెటర్లను ఆ బృందం విచారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం