పృథ్వీ షా వద్దు..రాహుల్ రావాల్సిందే
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదుచేసింది. అయితే ఈ ఘోరఓటమి ఆలోచనల నుంచి టీమిండియా తొందరగా..
మరికొన్ని మార్పులు అవసరం: గావస్కర్
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదు చేసింది. అయితే ఈ ఘోర ఓటమి ఆలోచనల నుంచి టీమిండియా తొందరగా బయటపడాలని, రెండో టెస్టులో గొప్పగా పుంజుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ అన్నాడు. పొరపాట్లను సరిదిద్దుకోకపోతే కంగారూల గడ్డపై టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్కు గురికావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సూచించాడు.
‘‘మెల్బోర్న్ టెస్టును భారత్ గొప్పగా ఆరంభించాలి. సానుకూల ఆలోచన ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. అలా చేయకపోతే టెస్టు సిరీస్ను 0-4తో కోల్పోయే ప్రమాదం ఉంది. సానుకూల మనస్తత్వంతో బరిలోకి దిగితే టీమిండియా ఎందుకు సత్తాచాటదు? తప్పక రాణిస్తుంది. తొలి టెస్టు ప్రదర్శన తర్వాత కోపం రావొచ్చు. అయితే క్రికెట్లో ఏమైనా జరగవచ్చు. శుక్రవారం, శనివారం రోజు జరిగిన ఆటను గమనించండి. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి’’ అని గావస్కర్ తెలిపాడు.
‘‘ఆస్ట్రేలియా బలహీనత వాళ్ల బ్యాటింగ్. దానిపై దృష్టిసారించాలి. ఫీల్డింగ్లో చురుకుగా ఉండి, క్యాచ్లను అందుకోవాలి. తొలి టెస్టులో లబుషేన్, టిమ్ పైన్ ఆదిలోనే వెనుదిరిగేవారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్కు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్లను జారవిడవడంతో ఆధిక్యం 50 పరుగులకే పరిమితమైంది. అయితే భారత తుదిజట్టులో రెండు మార్పులు అవసరం. పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్ రావాలి. అలాగే శుభ్మన్ గిల్కు కూడా చోటు దక్కాలి. అతడు అయిదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాలి. గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరంభం గొప్పగా ఉంటే పైచేయి సాధించగలం’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ షా (0,4) విఫలమైన సంగతి తెలిసిందే.
తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమి గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘షమి గాయం భారత్కు ప్రధాన సమస్య. అతడు బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించగలడు. అతడు లేకపోవడం టీమిండియాకు సమస్యే. అయితే ఇషాంత్ శర్మ ఫిట్గా ఉంటే వెంటనే అతడిని ఆస్ట్రేలియాకు పంపించాలి. రోజుకు 20 ఓవర్లు బౌలింగ్ చేసే ఫిట్నెస్తో ఉంటే అతడిని తొందరగా టీమిండియాతో కలిసేలా ప్రయత్నించాలి. కాగా, టీమిండియా బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. నవదీప్ సైని మంచి బౌలరే. కానీ వార్మప్ మ్యాచ్లో అతడు బౌలింగ్ తీరుని చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టలేడనిపిస్తోంది’’ అని అన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?