భారత్లోనే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు
మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ స్పందించాడు. మహీ భారత్లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు...
ధోనీ రిటైర్మెంట్పై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్
ఇంటర్నెట్డెస్క్: మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ స్పందించాడు. మహీ భారత్లోనే గొప్ప కాదని, ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అలా ప్రశంసించేందుకు నిజమైన అర్హుడని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక్కడే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడని మాజీ క్రికెటర్ గుర్తుచేసుకున్నాడు. ఇక 2005లో పాకిస్థాన్ భారత పర్యటన సందర్భంగానే ధోనీ వెలుగులోకి వచ్చాడని, అప్పుడు తాను పాకిస్థాన్కు కెప్టెన్గా కొనసాగినట్లు స్పష్టంచేశాడు. తన కళ్లముందే మహీ అరంగేట్రం చేసినా అతడు ఆడే విధానం, బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అప్పుడే ధోనీ ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడాడని వ్యాఖ్యానించాడు.
మరోవైపు ధోనీ సారథ్యంలోనే టీమ్ఇండియా విజయాల నిష్పత్తి మెరుగైందని, అంతకుముందు కేవలం ఉపఖండంలోనే రాణించేదని ఇంజమామ్ చెప్పాడు. ధోనీ పగ్గాలందుకున్నాక విదేశాల్లో సైతం మంచి ఫలితాలు రాబట్టిందని కొనియాడాడు. ఎక్కడికెళ్లినా గెలవాలనే పట్టుదలతోనే ముందడుగు వేస్తాడని, కెప్టెన్గా ఎలా విజయవంతమయ్యాడో ఆటగాడిగానూ అలాగే కొనసాగాడని పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా మ్యాచ్ను ఎలా ముగించాలనే విషయం అతడికి బాగా తెలుసని చెప్పాడు. అతడిలో ఆ లక్షణం చాలా మంచిదని, అది తనకు నచ్చిందని ఇంజమామ్ అన్నాడు. అలాగే టీమ్ఇండియాలో బాగా ఆడేవాళ్లు ఎంతమంది ఉన్నా, ఎవరూ చివరి వరకు క్రీజులో ఉండి గెలిపించేవాళ్లు కాదని చాలా మంది విమర్శించేవారన్నాడు. అలాంటిది ధోనీ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నాడు. అతడు చేసేవి ఎన్ని పరుగులైనా విజయం సాధించడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకునేవాడని వివరించాడు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్ ఫైనల్లో నాలుగో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును గెలిపించాడని మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం