రోహిత్ కెప్టెన్ కాకుంటే టీమిండియాకే సిగ్గుచేటు
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా చేయాలని డిమాండ్ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా స్పందించాడు. ముంబయి ఐదోసారి...
గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు
దిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా చేయాలని డిమాండ్ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ముంబయి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గౌతీ మాట్లాడాడు.
‘రోహిత్ శర్మ టీమ్ఇండియాకు సారథి కాకపోతే అది జట్టుకే నష్టం. అతడికి కాదు. జట్టు ఎంత పటిష్ఠంగా ఉంటుందో కెప్టెన్ కూడా అంతే ఉండాలి. దానిని నేను అంగీకరిస్తా. అయితే ఒక సారథి మెరుగైనవాడా? కాదా? అని ఎలా నిర్ణయించగలం? ఆ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి. రోహిత్ ఐదుసార్లు ముంబయికి ట్రోఫీ అందించాడు’ అని గంభీర్ అన్నాడు.
‘భారత్లో ఎంఎస్ ధోనీ అత్యుత్తమ సారథి అని ఎప్పుడూ అంటాం. ఎందుకంటే అతడు రెండు ప్రపంచకప్లు, మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి. రోహిత్ సైతం ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. టోర్నీ చరిత్రలోనే అతడు అత్యంత విజయవంతమైన నాయకుడు. ఇంకా చెప్పాలంటే టీమ్ఇండియా పరిమిత ఓవర్ల సారథ్యం లేదా టీ20 నాయకత్వం అతడికి అప్పజెప్పకుంటే అది సిగ్గుచేటే. ఇంతకన్నా నిరూపించుకోవడానికి ఇంకేముంటుంది? అతడు టీమ్ఇండియా కెప్టెన్ కాకపోతే జట్టుకే నష్టం’ అని గౌతీ స్పష్టం చేశాడు.
ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీని తానేమీ తక్కువ చేయడం లేదని గంభీర్ అన్నాడు. అన్ని దేశాలు అవలంభిస్తున్న ఇద్దరు సారథుల వ్యూహం పనిచేస్తుందని నొక్కి చెబుతున్నా అన్నాడు. ‘బీసీసీఐ ఇద్దరు కెప్టెన్లను పరిశీలించాలి. ఎవ్వరూ తక్కువేమీ కాదు. తెల్ల బంతి క్రికెట్లో కోహ్లీ కన్నా తాను మెరుగైన సారథిగా రోహిత్ నిరూపించుకున్నాడు. 13 సీజన్లలో ఒక ఆటగాడు ఐదు టైటిళ్లు అందిస్తే మరొకరు ఏమీ చేయలేదు. రోహిత్, కోహ్లీ ఒకే వేదికపై నాయకత్వం వహించారు. ఒకే సమయంలో సారథులుగా ఉన్నారు. రోహిత్ విజయవంతం అయ్యాడు’ అని అన్నాడు.
ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గంభీర్తో ఏకీభవించాడు. రోహిత్శర్మ టీమ్ఇండియా టీ20 సారథిగా ఎంపికవ్వాలని పేర్కొన్నాడు. అతడికి టీ20లు ఎలా గెలవాలో తెలుసని ప్రశంసించాడు. ఇక మాజీ క్రికెటర్లు, అభిమానులు రోహిత్ను ప్రశంసల్లో ముంచెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో