ధోనీ వీడ్కోలు.. ఇక నేనూ రిటైర్ అవుతా!
టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో కొందరు ఆయనంటే ప్రాణమిస్తారు. అతనాడే మ్యాచుల కోసం ఏ దేశమైనా వెళ్తారు. టికెట్లు కోసం ఆరాటపడతారు. అలాంటి అభిమానుల్లో ఒకరే మహ్మద్ బషీర్ బొజాయ్...
ఇకపై క్రికెట్ చూడనంటున్న పాక్ అభిమాని బషీర్
(సచిన్ అభిమాని సుధీర్తో బషీర్)
ముంబయి: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో కొందరు ఆయనంటే ప్రాణమిస్తారు. అతనాడే మ్యాచుల కోసం ఏ దేశమైనా వెళ్తారు. టికెట్లు కోసం ఆరాటపడతారు. అలాంటి అభిమానుల్లో ఒకరు మహ్మద్ బషీర్ బొజాయ్ (చాచా చికాగో అని ముద్దుపేరు). పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన ఆయన వృత్తిరీత్యా షికాగోలో స్థిరపడ్డారు. ఆగస్టు 15న ధోనీ వీడ్కోలు పలికాడని తెలిసి ఇకపై తాను క్రికెట్ వీక్షణకు ముగింపు పలుకుతానని అంటున్నారు. కరోనా పరిస్థితులు సర్దుకున్నాక రాంచీ వచ్చి మహీని కలుసుకుంటానని పీటీఐతో చెప్పారు.
‘మహీ వీడ్కోలు పలికాడు. నేనూ రిటైర్ అవుతా. అతను ఆడటం లేదు కాబట్టి మ్యాచులు చూసేందుకు నేనిక విదేశాలకు వెళ్లను. అతడిని నేను ప్రేమించా. అతడు నన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప ఆటగాళ్లైనా ఏదో ఒకరోజు ముగించాల్సిందే. కానీ అతడి వీడ్కోలు నాకెన్నో మధురస్మృతులను గుర్తుకు తెస్తోంది. మహీ వీడ్కోలు మ్యాచ్ ఆడివుంటే బాగుండేది’ అని చాచా అన్నారు.
వాంఖడే వేదికగా 2011లో జరిగిన ప్రపంచకప్లో భారత్, పాక్ పోరుకు బషీర్కు టికెట్ దొరకలేదు. అప్పుడు ధోనీయే అతడికి టికెట్ ఇప్పించాడు. బషీర్కు ఇప్పుడు 65+ ఏళ్లు ఉంటాయి. మూడుసార్లు గుండెపోటు నుంచి బయటపడ్డారు. కరోనా కారణంగా భారత్కు రాలేకపోతున్నానని పరిస్థితులు కుదుటపడ్డాక రాంచీకి వెళ్తానని అంటున్నారు. మహీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. మరో అభిమాని అయిన రాంబాబునూ వెంట తీసుకెళ్తానని తెలిపారు. ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లి మహీని చూసే అవకాశమున్నా ఆరోగ్య కారణాలతో వెళ్లడం లేదన్నారు.
గతంలో చాలాసార్లు మహీతో మాట్లాడేవాడినని 2019 నుంచీ కుదరడం లేదని బషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొన్ని సందర్భాల్లో అతడితో మాట్లాడే అవకాశం ఉండేది. 2019 నుంచి కష్టంగా ఉంది. అయితే నిరుడు ప్రపంచకప్ పోరులోనూ మహీ నాకు టికెట్ ఇప్పటించాడు. 2018 ఆసియాకప్ సందర్భంలో తన గదికి తీసుకెళ్లి జెర్సీ అందజేశాడు. నన్ను కలిసే సమయం లేనప్పుడు ఎవరితోనైనా టికెట్లు పంపిస్తాడు. 2015 ప్రపంచకప్ సమయంలో జరిగిన సంఘటనను నేనెప్పటికీ మర్చిపోలేను. సిడ్నీలో మ్యాచు చూస్తున్నాను. ఎండ బాగా ఉంది. అప్పుడు సురేశ్ రైనా వచ్చి నాకు కళ్లద్దాలు ఇచ్చాడు. మహీ పంపించాడని చెప్పాడు. నేను చిరునవ్వు నవ్వాను’ అని బషీర్ అన్నారు.
ధోనీ కోసం చప్పట్లు కొడుతున్నప్పుడు కొందరు పాక్ అభిమానులు తనను వెన్నుపోటుదారుడని అవమానిస్తారని బషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తాను పట్టించుకోవడం మానేశానని అన్నారు. 2019లోనూ బర్మింగ్హామ్లో ఇలా జరిగిందని అయితే దేశాల కన్నా మానవత్వానికే తాను ఓటేస్తానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్