ఫుట్బాల్తో జీవితపాఠాలు
అది దిల్లీ నగరంలోని ఓ మురికివాడ. సమయం ఉదయం 3:30. స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఫుట్బాల్ ఆడేందుకు మైదానానికి బయలుదేరారు ఆ మురికివాడలో నివసించే పిల్లలు. ...
చిత్రాలు: వారి అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: అది దిల్లీ నగరంలోని ఓ మురికివాడ. సమయం ఉదయం 3:30. స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఫుట్బాల్ ఆడేందుకు మైదానానికి బయలుదేరారు ఆ మురికివాడలో నివసించే పిల్లలు. వీరంతా ఎవరో తెలుసా! ఒకప్పుడు దొంగతనాలు చేసినవారు. తినేందుకు అడుక్కునే వారు. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు. ఒకరైతే ఏకంగా తీవ్రవాదైపోదామనుకున్నారు. కానీ ఇప్పుడు వీరందరూ మారారు. వీరిని మార్చాడో వ్యక్తి. వారి కోసం ఓ అకాడమీ స్థాపించాడు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంతకీ ఎవరతను? తను స్థాపించిన అకాడమీ ఏంటి? చదివేద్దాం.
దిల్లీలోని ఓ మురికివాడ. పేరు వికాస్ పురి. అక్కడ పిల్లలందరూ చదువుకు దూరమై, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తిండి, చదువుకు ఆమడదూరంలో అంధకారంలో బతికేస్తున్న వారిని చూసి చలించిపోయాడో ఓ కుర్రాడు. పేరు సిల్వెస్టర్ పీటర్. అప్పుడు తన వయసు కేవలం 13 సంవత్సరాలు. వారికి సరైన విద్య అందేలా చూడాలనుకున్నాడు. ఆ సమయంలో తనకొచ్చిన ఆలోచన ఫుట్బాల్. సంప్రదాయ చదువుల కంటే సమాజాన్ని చదివేలా వారికి ఆటలతో శిక్షణనివ్వాలనుకున్నాడు. అందుకు ఓ అకాడమిని స్థాపించాడు. అదే ‘మై ఏంజెల్స్ అకాడమి’. ఫుట్బాల్ అంటే తనకి చాలా ఇష్టం అందుకే ఆ ఆటతోనే వారిలో మార్పు తేవాలనుకున్నాడు. అలా దగ్గరలోని పబ్లిక్ గ్రౌండ్ని ఎంచుకుని వారికి ఫుట్బాల్ శిక్షణనివ్వడం మొదలెట్టాడు. ప్రతి రోజూ ఉదయం 3:30కి శిక్షణ ప్రారంభం. ఆ సమయంలో మైదానంలో ఎవరూ ఉండరు వారు తప్ప.. అందుకే ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. రోజూ వచ్చేలా ఆ పిల్లల్లో ఆసక్తి పెంచాడు. గ్రౌండ్కి వచ్చీరాగానే వారికి వార్మప్ అవసరం. ముందుగా మైదానాన్ని శుభ్రం చేయడమే వారి వార్మప్. అలా వారికి శుభ్రతపైనా, పర్యావరణంపైనా అవగాహన కల్పించేవాడు. శుభ్రమైన దుస్తులనే ధరించాలని చెప్పేవాడు. ఇలా రోజూ ఉదయం సుమారు 130మంది బాలబాలికలకు శిక్షణనిస్తాడు. గత 29ఏళ్లుగా ఎంతో మంది ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేశాడు. ప్రయివేటు పాఠశాల విద్యార్థులతో ఫుట్బాల్ పోటీల్లో తలపడి ఎన్నో విజయాలు అందుకుంది తన ‘మై ఏంజెల్స్ అకాడమి’. మైదానంలో పేద ధనిక తేడాలేదని.. ఒక్కసారి మైదానంలో అడుగెడితే అన్నీ మరిచి ఆటలో సత్తా చాటాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడీ ఫుట్బాల్ గురు పీటర్..
అదొక్కటే కాదు..!
కేవలం ఫుట్బాల్ మాత్రమే కాదు. జీవితంలో తన కాళ్లపై తాము నిలబడేలా జీవిత పాఠాలను నేర్పుతున్నాడు. ఒక్కపూట తిండి కోసం ఇంటింటికీ తిరిగే పిల్లలు ఇప్పుడు స్వయంగా వంట చేసి ఇతరుల కడుపునింపుతున్నారు. ఎప్పుడూ గొడవలు, అల్లర్లతో కుస్తీలు పట్టే బాలలకి యోగా, వ్యాయామంతో శాంతి పాఠాలను నేర్పుతున్నాడు. అంతేకాదు వారికి నచ్చిన రంగాల్లో వారు స్థిరపడేలా నాట్యం, సంగీతం, చెస్, డిజైనింగ్, పేయింటింగ్, కంప్యూటర్ విద్య.. ఇలా అనేక రంగాల్లో వారి ప్రతిభను నిరూపించుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాడు. జీవితంలో సమయపాలన, సహనం, గెలుపోటములను స్వీకరించేతత్వం.. ఇవి ముఖ్యమని చెబుతూ వారిని అభివృద్ధి పథంలోకి సాగనంపుతున్నాడు. వీలైనపుడు విహారయాత్రలకు తీసుకెళ్తూ వారికి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. తన సొంత డబ్బు, స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో వీటన్నింటికీ కార్యరూపం దాల్చేలా చూస్తున్నాడు.
అదే తన సంతోషం
తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడిన పీటర్కి చదువు విలువ తెలుసు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదంటాడు. సమాజం పట్ల ఓ అవగాహన కలిగి ఉండాలంటాడు. తోటి వారు ఆపదలో ఉంటే సహాయం చేయాలంటాడు. అలా తన సంస్థ ద్వారా ఎంతో మంది దొంగతనాలకు అలవాటుపడిన వారిని, అడుక్కునే పిల్లలని, కాగితాలు ఏరుకునే చిన్నారులని మార్చానని అదే తనకి సంతృప్తినిస్తుందని చెబుతుంటాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు ఇప్పడు ఫుట్బాల్ ప్లేయర్లుగా, కోచ్లుగా మారారు. అంతేకాదు ‘లెర్న్ అండ్ ఎర్న్’ ప్రోగ్రామ్ ద్వారా అక్కడే నేర్చుకుని సంపాదించుకునేలా చేస్తోందీ తన అకాడమి. ఇక్కడి నుంచి వెళ్లిన వారు కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలనీ సంపాదించారు. నెలనెలా వారి జీతంతో సగభాగం సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తుంటారని పీటర్ చెబుతుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!