ముంబయి హ్యాట్రిక్
ముంబయి సేన మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6)
57 పరుగుల తేడాతో రాజస్థాన్పై ఘన విజయం
ఇంటర్నెట్డెస్క్: ముంబయి సేన మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టును బుమ్రా (4/20) దెబ్బతీశాడు. బట్లర్ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) పోరాడాడు. ఈ గెలుపుతో రోహిత్సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ సీజన్లో ముంబయికి ఇది వరుసగా మూడో విజయం.
బట్లర్ ఒక్కడే..
ఛేదనలో బట్లర్ మినహా ఎవరూ పోరాడలేపోయారు. ముంబయి పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్, సంజు శాంసన్ డకౌటవ్వగా.. స్మిత్ ఆరు పరుగులకు ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మహిపాల్ లొమ్రార్ (11; 13 బంతుల్లో, 1×4)తో కలిసి బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే లొమ్రార్ను రాహుల్ చాహర్ (1/24) బోల్తా కొట్టించాడు. అనంతరం బట్లర్ గేర్ మార్చి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తొలి 24 బంతుల్లో అతడు 24 పరుగులే చేశాడు. తర్వాత సిక్సర్లతో స్కోరుబోర్డును ముందుకు నడింపించాడు. అయితే పొలార్డ్ అద్భుతమైన క్యాచ్కు ప్యాటిన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆఖర్లో ఆర్చర్ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించింది. ముంబయి బౌలర్లలో బుమ్రా (4/20), బౌల్ట్ (2/26), ప్యాటిన్సన్ (2/19) రాణించారు.
అదరగొట్టిన సూర్యకుమార్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్ శర్మ (35; 23 బంతుల్లో, 2×4, 3×6), డికాక్ (23; 15 బంతుల్లో, 3×4,1×6) బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్కు 49 పరుగులు జోడించారు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ త్యాగి (1/36)..5వ ఓవర్లో డికాక్ను బోల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి హిట్మ్యాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రోహిత్, ఇషాన్ కిషన్ (0)ను వరుస బంతుల్లో శ్రేయస్ గోపాల్ (2/28) పెవిలియన్కు పంపించి ఆ జట్టును దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కృనాల్ పాండ్య (12; 17 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. మరోవైపు సూర్యకుమార్ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్య (30*; 19 బంతుల్లో 2×4, 1×6) ఆశించిన రీతిలో చెలరేగలేకపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి