ధోనీ.. 2007 టీ20 ప్రపంచకప్పే ఉదాహరణ
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అతడికి రాసిన సుదీర్ఘ లేఖను మహీ గురువారం ట్విటర్లో పంచుకున్నాడు...
మహేంద్రసింగ్ ధోనీకి ప్రధాని మోదీ సుదీర్ఘ లేఖ..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అతడికి రాసిన సుదీర్ఘ లేఖను మహీ గురువారం ట్విటర్లో పంచుకున్నాడు. టీమ్ఇండియాకు అతడు చేసిన సేవలతో పాటు సైన్యంలోనూ పనిచేస్తున్న అతడిని ప్రధాని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాజీ సారథి ప్రధానికి ధన్యవాదాలు చెప్పాడు. ఒక కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు ఎప్పుడూ అభినందనలను ఆశిస్తారని, వాళ్ల కష్టాలకు, త్యాగాలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలనుకుంటారని తెలిపాడు. ఈ సందర్భంగా మోదీ లేఖకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రధాని రాసిన లేఖ.. ఆయన మాటల్లో.. ‘ఎవరూ ఊహించని విధంగా మీ స్టైల్లోనే ఆగస్టు 15న ఒక చిన్న వీడియోతో రిటైర్మెంట్ ప్రకటించి దీర్ఘకాలంగా నడుస్తున్న ఒక చర్చకు తెరదించారు. ఈ నిర్ణయం 130 కోట్ల మందిని బాధించినా 15 ఏళ్లుగా భారత క్రికెట్కు మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
‘టీమ్ఇండియాకే మీరు అతి గొప్ప సారథి. మీ కెప్టెన్సీతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అలాగే ఒక బ్యాట్స్మన్గా, వికెట్కీపర్గా మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కష్ట సమయాల్లో మీరున్నారనే భరోసా, మ్యాచ్ను గెలిపిస్తారనే ధీమా ఈ భారతావని ఎప్పటికీ మర్చిపోదు. మరీ ముఖ్యంగా 2011 ప్రపంచకప్ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో నిలిచిపోతుంది. అలాగే మహేంద్రసింగ్ ధోనీ అనే పేరు కేవలం గణంకాలకో లేక కొన్ని మ్యాచ్ల విజయాల వరకే పరిమితం కాదు. అదెప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. మిమల్ని ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా సరైంది కాదు. మిమ్మల్ని అంచనా వేయాలంటే మాటలు సరిపోవు. చిన్న పట్టణం నుంచి వచ్చి దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అన్నిటికన్నా ముఖ్యం దేశాన్ని గర్వపడేలా చేశారు. మీ పనితీరుతో కోట్లాదిమంది యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. కొత్త భారతావనికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఇంటిపేరు లేకుండానే మీకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు’ అని మోదీ ప్రశంసించారు.
‘మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందనే విషయం తెలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అవసరం లేదు. ఇదే స్ఫూర్తి మీరు ఎంతో మంది యువతలో రగిలించారు. ఈ క్రమంలో నేటి యువతరం కష్టాలను చూసి జడిసిపోదు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. అందుకు.. మీరు సాధించిన 2007 టీ20 ప్రపంచకప్పే అసలైన ఉదాహరణ. కష్ట సమయాల్లో మీరు జట్టు నడిపించిన తీరే వారికి ప్రేరణ. ఇక మీ కేశాలంకరణతో ఎలా కనిపించినా గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం ఎంతో మందికి ఒక పాఠంలా నిలుస్తుంది. ఇక మీరు భద్రతా దళాల్లో చేసిన సేవలు అమోఘం. మన సైనికులతో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ల మంచికోసం మీరు పడే తపన ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మెచ్చుకున్నారు.
చివరగా సాక్షి, జీవాపై స్పందించిన మోదీ.. ఇప్పుడు వారు ధోనీతో అధిక సమయం గడుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాళ్లకి తన అభినందనలు తెలిపారు. వాళ్ల త్యాగాలు, మద్దతు లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే అటు ప్రొఫెషనల్, ఇటు వ్యక్తిగత జీవితం.. రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంలోనూ ధోనీని చూసి నేర్చుకోవచ్చని యువతరానికి ప్రధాని సూచించారు. మాజీ సారథి ఒక మ్యాచ్లో విజయం సాధించాక తన కూతురు జీవాతో ఆడుకోవడం చూశానని, అది ఎప్పటికీ తనకు గుర్తుండిపోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇకపై మాజీ సారథి భవిష్యత్తు బాగుండాలని ఆశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్