యూఎస్‌ ఓపెన్‌లో భారత్‌ ఆశలు గల్లంతు

యూఎస్‌ ఓపెన్‌ 2020 పురుషుల డబుల్స్‌ విభాగంలో ఇండో కెనడియన్‌ రోహన్‌ బోపన్న-డెనిస్‌ షాపోవాలో జోడీ క్వార్టర్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. దీంతో మెగా గ్రాండ్‌ స్లామ్‌లో...

Updated : 17 Sep 2022 16:48 IST

క్వార్టర్స్‌ నుంచి రోహన్‌ బోపన్న జోడీ ఔట్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2020 పురుషుల డబుల్స్‌ విభాగంలో ఇండో కెనడియన్‌ రోహన్‌ బోపన్న-డెనిస్‌ షాపోవాలో జోడీ క్వార్టర్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. దీంతో మెగా గ్రాండ్‌ స్లామ్‌లో భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి. సోమవారం రాత్రి నెదర్లాండ్స్‌, రొమానియాకు చెందిన జీన్‌ జూలియన్‌-హోరియా టెకావుతో తలపడిన క్వార్టర్స్‌లో బోపన్న-డెనిస్‌ జోడీ 5-7,5-7 తేడాతో విఫలమైంది. వీరిద్దరూ ప్రత్యర్థులపై అద్భుతంగా పోరాడినా కీలక సమయంలో చేతులెత్తేశారు. దీంతో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అంతకుముందు ఆడిన రెండో రౌండ్‌లో ఈ ఇండో కెనడియన్‌ పెయిర్‌ ఆరో సీడ్‌ కెవిన్‌ క్వావీ, ఆండ్రియా మైల్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. బోపన్న ఓటమితో యూఎస్‌ ఓపెన్‌లో భారత్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇదివరకే పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత టాప్‌ సీడ్‌ సుమిత్‌ నగల్‌ రెండో రౌండ్‌ నుంచే నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో అతడు డొమినిక్‌ థీమ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని