నీ తరంలోనే అథ్లెట్‌ అయినందుకు: సానియా

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించింది. అతడు ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్‌ అయినందుకు గర్వపడుతున్నట్లు...

Published : 17 Aug 2020 01:36 IST

ధోనీ రిటైర్మెంట్‌పై భారత టెన్నిస్‌ స్టార్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. అతడు ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్‌ అయినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. మహీ నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ‘ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. అలాగే నీ భవిష్యత్‌ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా’ అని పేర్కొంది. 

ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పుడు టీమ్‌ఇండియా గెలిచేలా అనిపించినా, చివరి క్షణాల్లో అతడు రనౌటవ్వగా భారత్‌ ఓటమిపాలైంది. దీంతో మాజీ సారథి అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. మొదట్లో రెండు నెలలేనంటూ విశ్రాంతి తీసుకున్నా తర్వాత దాన్ని పొడిగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని