ధోనీ విషయంలో బీసీసీఐ ప్రవర్తన సరిగ్గా లేదు
గతేడాది వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ ఆడి జట్టులోకి వస్తాడని
భారత క్రికెట్ బోర్డుపై పాక్ మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే..
ఇంటర్నెట్డెస్క్: గతేడాది వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ ఆడి జట్టులోకి వస్తాడని ఆశించినా గతవారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని, అంత గొప్ప సారథికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని పాకిస్థాన్ మాజీ కీపర్ సక్లైన్ ముస్తాక్ పేర్కొన్నాడు. మహీ వీడ్కోలు పలికాక తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.
ప్రతీ క్రికెటర్కి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదని ముస్తాక్ అన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనిపించినా అతడు చాలా ప్రభావితం చేస్తాడన్నాడు. మహీ సామాన్యమైన ఆటగాడు కాదని, నూటికి ఒక్కడని ప్రశంసించాడు. అతడి పేరూ, గౌరవం అలా నిలిచిపోతాయని చెప్పాడు. టీమ్ఇండియా ఇప్పుడున్న స్థితికి అతడే పెద్ద కారణమని పేర్కొన్నాడు. అలాగే అతడిని అనుకరించి, అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారని, వాళ్లంతా ధోనీని చివరి మ్యాచ్లో చూడాలనుకుంటారని అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలోనే మాట్లాడుతూ తాను ఎవరిమీదా తప్పుగా మాట్లాడనని చెప్పాడు. అయితే, ధోనీ విషయంలోనే మనసు ఆగలేక ఇలా స్పందించాల్సి వచ్చిందని వివరించాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతడితో సరిగ్గా ప్రవర్తించలేదని తెలిపాడు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదన్నాడు. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారన్నాడు. ఇలా అన్నందుకు బీసీసీఐకి క్షమాపణలు చెబుతున్నట్లు వివరించాడు. ప్రతీ క్రికెటర్ కూడా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడని, ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. చివరగా టీమ్ఇండియా మాజీ సారథి అసలైన హీరో అని, అతడో వజ్రం వంటి మనిషని కీర్తించాడు. మహీ పట్ల గర్వంగా ఉందని ముస్తాక్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్