శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచాం : స్టోయినిస్
తను సారథి కాకపోయినప్పటికీ దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అన్నాడు. తన ఆటతీరుతో శిఖర్ జట్టును ప్రభావితం చేశాడని ధావన్ను ప్రశంసించాడు. ఈ సీజన్లో జట్టు కోసం చాలా సార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్
అబుదాబి: దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ అన్నాడు. అతని ఆటతీరుతో శిఖర్ జట్టును ప్రభావితం చేశాడని ధావన్ను ప్రశంసించాడు. ఈ సీజన్లో జట్టు కోసం పలుమార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినట్లు స్టోయినిస్ తెలిపాడు. భిన్న పరిస్థితుల్లో గొప్పగా ఎలా రాణించాలో ధావన్ నుంచి నేర్చుకుంటున్నట్లు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ అనంతరం స్టొయినిస్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా స్టొయినిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు శ్రేయేస్ అయ్యర్ కెప్టెన్ అయినప్పటికీ ధావన్ ఆటగాళ్లను ముందుండి నడిపించాడని పేర్కొన్నాడు.
లీగ్ ఆరంభంలో విజయాలతో దూకుడుగా ఆడిన దిల్లీ చివర్లో వరుస ఓటములతో ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్తో ధావన్ జట్టులో జోష్ నింపాడని స్టొయినిస్ అన్నాడు. లీగ్లో ఇప్పటి వరకూ రెండు శతకాలు బాదిన ధావన్ 603 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచులోనూ శిఖర్ 78 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఇప్పటికే ఆరువందలకు పైగా పరుగులు చేసిన ధావన్కు ఫైనల్లో భారీ స్కోరు చేసే పని మిగిలి ఉందని స్టొయినిస్ అభిప్రాయపడ్డాడు.
ధావన్తో పాటు దిల్లీ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేస్తున్న స్టొయినిస్ లీగ్లో 352 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. ఆదివారం హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఓపెనర్గా వచ్చిన ఈ ఆల్రౌండర్ 38 పరుగులు చేశాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చేజారుతుందనే సమయంలో ఫామ్లో ఉన్న మనీశ్పాండేతో పాటు విలియమ్సన్ను ఔట్ చేసి దిల్లీ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదిలా ఉంటే టైటిల్ పోరులో తొలిసారి ఫైనల్కు చేరిన దిల్లీ మంగళవారం డిఫెడింగ్ ఛాంపియన్ ముంబయితో ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప