33కే వీడ్కోలు.. రైనా భావోద్వేగ లేఖ
ఇంకా వయసుంది. అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడగలిగే సత్తా ఉంది. పరుగుల వరద పారించే కసి ఉంది. అయినా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు సురేశ్ రైనా. తన ఎడమచేతి వాటంతో టీమ్ఇండియాకు కీలక...
అందరికీ వందనాలు తెలిపిన ధోనీ ఆప్త మిత్రుడు
ఇంటర్నెట్ డెస్క్: ఇంకా వయసుంది. అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడగలిగే సత్తా ఉంది. పరుగుల వరద పారించే కసి ఉంది. అయినా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు సురేశ్ రైనా. తన ఎడమచేతి వాటంతో టీమ్ఇండియాకు కీలక విజయాలు అందించిన అతడు మహీ వీడ్కోలు పలికిన ఐదు నిమిషాలకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించి విస్మయానికి గురిచేశాడు. 33 ఏళ్లకే కెరీర్ను ముగించిన అతడు ఆదివారం భావోద్వేగంతో ఓ లేఖ రాశాడు.
‘మిశ్రమ అనుభూతులతో వీడ్కోలు ప్రకటన చేస్తున్నా. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచీ గల్లీల్లో ఆడుతూ క్రికెట్ను ఇష్టపడ్డాను. చిన్న పట్టణం నుంచి భారత జట్టులో అడుగుపెట్టాను. నాకు తెలిసిందంతా క్రికెట్టే. చేసిందంతా క్రికెట్టే. నా నరనరానా అదే జీర్ణించుకుపోయింది. దేవుడి ఆశీర్వాదం, అండగా నిలిచిన అభిమానుల ప్రేమను ప్రతి రోజూ గుర్తు చేసుకున్నాను. వారి ప్రేమ, అభిమానాలకు విలువ చేకూర్చేందుకే ప్రయత్నించాను. ఆటకు, దేశానికి అంకితమయ్యాను.
ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు స్తంభించిపోయాను. ఆగిపోతే న్యాయం కాదనే ముందుకు సాగాను. నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. అందరి సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేదే కాదు. నా తల్లిదండ్రుల త్యాగాలు, ప్రేమించే భార్య ప్రియాంక, పిల్లలు గ్రేసియా, రియో, సోదరులు, సోదరీమణులు, కుటుంబ సభ్యులు నన్నెంతో ప్రోత్సహించారు. నేను సరైన దారిలో నడిచేందుకు నా కోచ్లు మార్గనిర్దేశం వహించారు. గాయాల నుంచి కోలుకొనేందుకు ఫిజీషియన్లు, అత్యుత్తమంగా రాణించేందుకు ట్రైనర్లు సాయం చేశారు.
నీలిరంగు జెర్సీలు ధరించే మా కుర్రాళ్ల సహకారం లేకుండా నా కెరీర్ సాగేదే కాదు. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడే అదృష్టం నాకు దక్కింది. రాహుల్ భాయ్, అనిల్ భాయ్, సచిన్ పాజీ, నన్ను స్నేహితుడిగా భావిస్తూ మార్గనిర్దేశం వహించిన మహీ సారథ్యంలో ఆడటం అద్భుతం. బీసీసీఐ, యూపీ క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు. ఒక యూపీ కుర్రాడికి టీమ్ఇండియా తరఫున ఆడే అవకాశం కల్పించారు.
చివరగా నా అభిమానులకు, ఇన్నేళ్లూ మీరు చూపించిన ప్రేమ, అభిమానాలతోనే పెరిగి పెద్దయ్యాను. అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నతంగా ఎదిగేందుకు అండగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ, మీ సురేశ్ రైనా’ అని అతడు భావోద్వేగ లేఖను పోస్ట్చేశాడు. దాంతోపాటు ఓ వీడియోనూ జత చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు